పుస్తకాల్లేవ్, సౌకర్యాలు లేవు ఆన్ లైన్ క్లాసులెలా ?

పుస్తకాల్లేవ్, సౌకర్యాలు లేవు ఆన్ లైన్ క్లాసులెలా ?


 



 


 


కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి భారతదేశంలో ఇప్పటికే పిల్లల్లో ఉన్న డిజిటల్ డివైడ్ ని మరింతగా పెంచివేసిందా.. దేశం మొత్తం మీద 80 శాతం పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, డిజిటల్ విద్య ఏమాత్రం అందుబాటులో లేదా..


భారత్ లో ప్రభుత్వ పాఠశాలలు లాక్ డౌన్ కాలంలో విద్యార్థులందరికీ విద్యను అందించడంలో ఘోరంగా విఫలమయ్యాయా.. - అనే పరుస ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాల్సి ఉంది.



 


విశ్వమహమ్మారి కోవిడ్ వైరసను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ మీడియా ద్వారా విద్యా బోధన విధానాన్ని అనసరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.


ప్రైవేటు పాఠశాలలను పక్కన పెట్టి, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా సంస్థల్లో ఈ విద్యా విధానం ఏ మేరకు విజయవంమైందో తెలుసుకునేందుకు 'ఆక్స్ఫమ్ ఇండియా' స్వచ్ఛందంగా ఓ సర్వే నిర్వహించింది.


 



ఈ సంస్థ ప్రతినిధులు సర్వేలో భాగంగా ఇటీవల బిహార్, చత్తీస్ గఢ్, జార?ండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.


ఈ క్రమంలో డిజిటల్ విద్యావిధానం తమ పిల్లలకు అందుబాటులోకి రాలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 శాతం మంది జనాభాకే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది.



ఆ జనాభాలో కూడా దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు కూడా నెట్ సదుపాయం అందుబాటులో లేదు. ఆన్లైన్ తరగతులు అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా పెద్ద ప్రయోజనం కలగలేదని, అందుకు కారణం ఆన్లైన్ క్లాసులకు అనుగుణంగా తగిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకపోవడమేనని 80 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.


 


ఆన్‌లైన్ తరగతులు ప్రారంభానికి ముందే వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు


అందుబాటులో ఉండాలని, అలా లేకపోవడం దురదష్టకరమని 71 శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు.



 


 


డిజిటల్ తరగతుల విధానం దేశంలో కొత్త కాకపోయినా, కొన్ని సామాజిక వర్గాలకు నెట్ సదుపాయం అందుబాటులో లేదని 'ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్' సీఈవో రుక్మిణి బెనర్జీ తెలిపారు.


కఠిన పరిస్థితుల్లో డిజిటల్ తరగతులు ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకాలం పాటు విద్యా సంస్థలు మూత పడతాయని ఎవరూ ఊహించలేక పోయారని ఆమె చెప్పారు.


 



 


గత మార్చి నెలలో లాక్ డౌన్ కారణంగా పాఠశాలలను మూసివేయగా, జూన్ నెలలో ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు.


ఇక వారు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే.



మధ్యాహ్న భోజనంతోపాటు వారికిచ్చే లెర్నింగ్ పరికరాలను కూడా పునరుద్ధరించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 35 శాతానికి మించి పిల్లలకు ఈ సదుపాయం అందడం లేదని సర్వేలో తేలింది.


బిహార్, చత్తీస్ గఢ్, జారగిండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 1,158 మంది తల్లిదండ్రులు, 488 టీటర్లను కలిసి ఈ సర్వేని నిర్వహించారు.



సెప్టెంబర్ 4న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం చాలామంది కుటుంబాలకు డిజిటల్ ఉపకరణాలు లేకపోవడం, డిజిటల్ విద్యా మీడియం అందుబాటులో లేకపోవడం వల్ల తమ పిల్లలకు ఆన్ లైన్ చదువు అందడం లేదని తేలింది.


లాక్ డౌన్ కారణంగా ఉన్నట్లుండి విద్యా సంస్థలను మూసివేయడంతో దేశంలోని 32 కోట్ల మంది విద్యార్థులు విద్య పొందే అవకాశాలకు దూరమయ్యారని, ఆహార భద్రత లేమి, ఆర్థిక, సామాజిక ఒత్తిడి ఈ పిల్లలపై తీవ్ర ప్రభావం వేస్తోందని డ్రీమ్ ఎ డ్రీమ్ అనే ఎన్జీఓ అధ్యయనంలో తేలింది.


_________________________________________________________


Comments