కడప జిల్లా ప్రజల గొంతెండుతోంది

కడప జిల్లా ప్రజల గొంతెండుతోంది


గణనీయంగా . పడిపోయిన భూగర్భ జలాలు మంచినీటి కోసం ప్రజల నానా అవస్థలు



కడప : కడప గడప గొంతెండుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తాగునీటి కోసం జనం తల్లడిల్లుతున్నారు.


జిల్లాలో 42 మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. 940 గ్రామాల్లో నీటి సమస్య తారాస్థాయికి చేరింది.


నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. భూగర్భ జలాలు పడిపోయి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా చెరువులు, కుంటలు, నదుల్లో నీరు లేక బీటలువారాయి.


గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తాగునీటి ఎద్దడి నెలకొంది. జూన్ మూడో వారంలోకి అడుగు పెట్టినా చినుకు జాడలేదు. వారం రోజుల్లో వర్షం కురవకపోతే తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరుకుంటుంది.


 



 


దాహం తీర్చుకుందామంటే అందుబాటులో ఉన్న బోర్లు ఒట్టిపోయాయి. చుక్క నీరు రాక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ట్యాంకర్ల నీరే దిక్కయ్యాయి. అవి దాహార్తిని తీర్చలేక పోతున్నాయి.


ట్యాంకర్లను నింపే బోర్లు ఎండిపోతే ఇక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి పట్టణాల్లో కూడా తాగునీటి ఎద్దడి నెలకొంది.


820 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా మరో 120 గ్రామాలకు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని గ్రామీణ నీటి పారుదల శాఖాధికారులు సరఫరా చేస్తున్నారు.


ఇక కడప కార్పొరేషన్ లో నాలుగు రోజులకు ఒకసారి నీరు వస్తే బద్వేలు మున్సిపాలిటీలో రెండు మూడు రోజులకొకసారి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.


కడప పాలకవర్గం, అధికారుల ముందు చూపు కొరవడడంతో సకాలంలో అలగనూరు నుంచి నీటిని తెచ్చు కోవడంలో విఫలమయ్యారు.



నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం అన్న చందంగా అలగనూరు నుంచి నీరు ఆలస్యం కావడంతో కడపలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. నగరానికి కీలకమైన వాటర్గండిలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో దాహం కోసం కడప వాసులు అలమటించారు.


వారానికోసారి నీరు వచ్చే పరిస్థితి వచ్చింది.. అరు- ఎతే ఇప్పుడు నాలుగు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. అవి జనం అవసరాలకు తీర్చలేకపోతున్నాయి.


మినరల్ వాటర్ కొనుగోలు చేసి అవసరాలను తీర్చుకుంటున్నారు. పేదలైతే కార్పొరేషన్ నీటికోసం నాలుగు రోజుల పాటు ఎదు- వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు రు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. బద్వేలు తీవ్రంగా అడుగంటుతున్నాయి.


11 మండలాల్లో మున్సిపాలిటీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అక్కడ 50 మీటర్లకు పైగా లోతుకు నీటిమట్టం కొన్ని వార్డుల్లో రెండు రోజులకు, మూడు రోజులకు పడిపోయింది. వర్షం రాకపోతే రాబోయే రోజుల్లో నీరు సరఫరా చేస్తున్నారు.



ట్యాంకర్ల ద్వారా సరఫరా నీటి ఎద్దడి తారాస్థాయికి చేరుకుంటుంది. చేస్తున్నా అవి దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. కాలనీకి ట్యాంకర్లు వస్తేనే నీరు అందుతుంది. వానాకాలంలో పల్లెల్లో దాహం కేకలు తగ్గడం లేదు.


కుళాయిలకు నీరు రాక చాలా కాలమైంది. రోజూ 42 మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకర్ల కోసం ఎదురు చూసి ట్యాంకర్ల ద్వారా వచ్చే కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన, బద్వేలు, నీటితోనే అవసరాలు తీర్చుకుంటున్నామని పలు అట్లూరు, చిన్నమండెం, సంబేప్లలె, గోపవరం, గ్రామాల్లో ప్రజలు వాపోతున్నారు.


కడప నగరంలోని లక్కిరెడ్డిప్లలె, కోడూరు, మైదుకూరు, నందలూరు, ఎర్రముక్కప్లలెలో 4 నెలల నుంచి నీరు రాక పెనగలూరు, పెండ్లిమర్రి, పులివెందుల, పుల్లంపేట, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



 


రామాపురం, రాయచోటి, టి.సుండుప్లలె, కార్పొరేషన్ దగ్గర ధర్నాలు చేసినా అధికారులు జమ్మలమడుగు, దువ్వూరు, ముద్దనూరు తదితర పట్టించుకోవడం లేదు.


ఎర్రముక్కప్లలెలో నీటి సమమండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ స్య తీవ్రంగా ఉంది. వెంటనే బోర్లను, మోటార్లను మండలాల్లో మొత్తం 940 గ్రామాలు నీటి ఎద్దడికి రిపేరు చేయాలి. అడుగంటిపోయిన బోర్లలో పైపులు గురయ్యాయి. వేసి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.


Comments